Allu Arjun: ‘జవాన్’లో అతిథి పాత్రలో ‘పుష్ప’.. క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందా?

ABN , First Publish Date - 2023-02-13T15:30:31+05:30 IST

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న దక్షిణాది నటుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు..

Allu Arjun: ‘జవాన్’లో అతిథి పాత్రలో ‘పుష్ప’.. క్రేజీ కాంబోకి రంగం సిద్ధమైందా?
Allu Arjun

పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న దక్షిణాది నటుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. 2021లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఈయనకి దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా బాలీవుడ్‌ (Bollywood)లో ఈ స్టైలిష్ స్టార్ నటనకి మంచి పేరు వచ్చింది. దీంతో డైరెక్ట్‌గా ఓ బాలీవుడ్ సినిమా చేయాలని అర్జున్ భావిస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన బాలీవుడ్ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), నయనతార జంటగా ‘జవాన్’ (Jawan) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ దళపతి (Vijay Thalapathy) అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఆ మూవీలోని మరో ముఖ్యమైన పాత్రని బన్నీతో చేయించాలని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంది. అది అల్లు అర్జున్ చేస్తేనే బావుంటుందని మూవీ టీం ఆలోచిస్తోంది. నిన్ననే దీనికి సంబంధించిన కథని వినిపించారు. అయితే బన్నీ మాత్రం ఇంకా అంగీకారం తెలపలేదు. అయితే బన్నీ ఈ సినిమా కచ్చితంగా చేస్తాడని అట్లీ ఆశిస్తున్నాడట. నిజానికి ఈ పాత్ర కోసం యాక్టర్‌ని ఎంపిక చేయడం చాలా కష్టంగా ఉందట మూవీ టీంకి. ఎందుకంటే.. అది చాలా ముఖ్యమైన పాత్ర. కథాపరంగా ఆ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ఆ క్యారెక్టర్ ఓ స్టార్ హీరో చేస్తేనే బావుంటుందని అట్లీ భావిస్తున్నాడు. బన్నీ త్వరలో ఈ పాత్రకి ఓకే చెబుతాడని చిత్రబృందం భావిస్తోంది. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’లో నటిస్తున్నాడు. పుష్ప క్రియేట్ చేసిన రికార్డుల కారణంగా ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Updated Date - 2023-02-13T15:30:32+05:30 IST