TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!

ABN , First Publish Date - 2023-08-09T13:28:23+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది...

TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!

తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్నాయ్.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ (BRS) విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దించి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. ఈ క్రమంలో ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మార్చుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. ఇదిగో అధికారంలోకి వచ్చేశామా అన్నట్లుగా సీన్‌ క్రియేట్ అవుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కాంగ్రెస్‌దే గెలుపు అన్నట్లుగా కొన్ని సర్వేలు (Surveys) కూడా తేల్చడంతో ఇక పార్టీ శ్రేణుల్లో ఎనలేని జోష్ వచ్చింది. దీనికితోడు ఢిల్లీ వేదికగా అస్త్రశస్త్రాలు రెడీ అవుతున్నాయ్. సెంటిమెంట్‌తో పాటు ఆకర్షణీయ మేనిఫెస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. అధికార బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ (BRS-Congress) ఎలాంటి అస్త్రాలు ప్రయోగించబోతోంది..? సోనియాగాంధీ తెలంగాణకు ఏమేం వరాలు కురిపించబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


Congress.jpg

ఇదీ అసలు కథ..!

తెలంగాణ ఇచ్చిన పార్టీ అని కాంగ్రెస్‌కు పేరుందేగానీ.. రెండుసార్లు ఎన్నికలు జరిగినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది! దీనికి తోడు ఆ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలూ అధికార పార్టీలోకి దూకేయడం.. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తగలడంతో పార్టీకి గడ్డుకాలమే అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి కానీ.. కర్ణాటకలో కాంగ్రెస్ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని విజయకేతనం ఎగరేయడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మునుపెన్నడూ లేని జోష్ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నిక ఎదుర్కొంటోన్న కాంగ్రెస్‌కు ఈ గెలుపు జీవన్మరణ సమస్యేనని చెప్పుకోవచ్చు. పరిస్థితి పూర్తి సానుకూలంగా మారిన ఇప్పుడూ గెలవకపోతే ఇక అంతే సంగతులని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులూ ఒడ్డాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అందుకే.. అటు అధికార బీఆర్ఎస్.. ఇటు బీజేపీ నుంచి వలసల వర్షం.. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు ఓటేస్తుండటంతో ఇక హైకమాండ్ మరింత జోరు పెంచింది. దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకుని వ్యూహాలు రచించే పనిలో పడింది. ఇక ఎన్నికల కదనరంగంలోకి దూకేశాం అన్నట్లుగా అటు ఢిల్లీ నేతలు.. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోతున్నారు.

Revanth.jpg

సెంటిమెంట్‌.. సభలు ఇలా..!

గడిచిన రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ అస్త్రం కేసీఆర్‌కు (CM KCR) పని చేస్తే.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, సోనియా గాంధీ (Sonia Gandhi) పిలుపుతో ఆ అస్త్రం ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి వర్కవుట్‌ అవుతుందని హైకమాండ్ అంచనా వేస్తోంది. ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోనూ ప్రకటించి క్షేత్రస్థాయి నుంచీ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, పార్టీ మేనిఫెస్టోను ప్రతి గడపకూ చేరుస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ప్లీజ్.. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని సోనియాతో సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో వరుస భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా అధిష్టానం ప్లాన్ చేస్తోంది. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) , ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), సిద్దరామయ్యలను (Siddaramaiah) ఆహ్వానించి మూడు భారీ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ (TPCC) ప్లాన్‌ చేస్తోంది. ఈనెల 18న తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఖర్గే సభను నిర్వహించి.. కేసీఆర్‌ ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, బీసీ డిక్లరేషన్‌పైనా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయిద్దామని రేవంత్‌ నిర్ణయించడం.. బీసీలకు సీట్ల కోటాతోపాటు వారి అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను, హామీలనూ వివరిస్తూ డిక్లరేషన్‌ రూపొందిస్తోంది. ఈ నెలాఖరున సూర్యాపేటలో బీసీ గర్జన సభను నిర్వహించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబరు 7 తర్వాత ప్రియాంక సభను ఏర్పాటు చేసి అందులో మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. ఈ నాలుగు సభలనూ నిర్వహించి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలోకి కాంగ్రెస్‌ పార్టీ దిగనుంది. సెప్టెంబరు 17న రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. దానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ ఆమెతో తెలంగాణ ప్రజలకు పిలుపు ఇప్పించనుంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనూ ఆ సభలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దానిని ఆకర్షణీయంగా రూపుదిద్దనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Congress-Leaders.jpg

తేల్చేసిన సర్వేలు..

ప్రముఖ సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని తేలడం, దీనికి తోడు.. కాంగ్రెస్ వ్యూహకర్ సునీల్ కనుగోలు.. 119 సీట్లను 3 భాగాలుగా విభజించారు. A. కేటగిరీ‌లో 41 స్థానాలు.. ఇవి గన్‌షాట్‌గా గెలుచుకునేవి ఉండగా.. B. కేటగిరీలో 42 స్థానాల్లో ఉండగా.. ఇవి కొంచెం కష్టపడితే గెలిచే స్థానాలని.. C. కేటగిరీలో 36 స్థానాల్లో బలహీనంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని బేరీజు చేసుకుని ఎక్కడా నెగిటివ్ కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లాలని కాంగ్రెస్‌కు సునీల్ సూచించారని తెలియవచ్చింది. ఈ మేరకు రిపోర్టును కూడా కాంగ్రెస్ పెద్దలకు అందజేయడం జరిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఆగస్ట్ 15 తర్వాత 50 నుంచి 70 మందితో కూడిన తొలి జాబితాను అధిష్టానం ప్రకటించే అవకాశముంది. మరోవైపు.. కేసీఆర్ కూడా ఈనెల 12న లేదా 13న 87 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. కాంగ్రెస్ ఎన్నికలకు కదనరంగానికి సర్వం సిద్ధం చేసుకున్నదన్న మాట. సెప్టెంబర్-17 వరకు అయితే అస్త్ర శస్త్రాలు గట్టిగానే ప్రయోగించనుంది కాంగ్రెస్. మరి మున్ముందు ఏం జరుగుతుందో.. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాల్సిందే మరి.

revanth.jpg


ఇవి కూడా చదవండి


Gaddar And KCR : షాకింగ్.. గద్దర్‌ను కేసీఆర్ ఇంతలా అవమానించారా.. 3 గంటలపాటు ఎండలోనే..!


TS Congress : ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం.. ఇక రాబోయే రోజుల్లో..!


TS Politics : బీఆర్ఎస్‌‌కు ఊహించని షాక్.. కాంగ్రెస్‌లోకి బిగ్ షాట్.. పార్టీలో చేరకముందే సర్వే చేయగా..?


YSRCP Targets Chiru : రీల్ ‘BRO’తో మొదలై ‘రియల్ బ్రో’ చిరు దగ్గర బ్లాస్ట్.. రేపొద్దున ఇదేగానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఊహకందేనా..!?


Updated Date - 2023-08-09T13:31:57+05:30 IST