ఓటు హక్కును వినియోగించుకున్న సినీ సెలబ్రెటిలు
ABN, First Publish Date - 2023-11-30T09:40:56+05:30 IST
సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు...
1/6
స్టైలిష్ హీరో అల్లు అర్జున్, తన భార్య స్నేహారెడ్డి, తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్లతో కలిసి బీఎస్ఎన్ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153) వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
2/6
మెగాస్టార్ చిరంజీవి తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీక్లబ్లో ఓట్లు వేశారు. భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చితమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
3/6
సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓబుల్రెడ్డి స్కూల్ (పోలింగ్ బూత్ 150) వద్ద సామాన్యుల క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
4/6
సినీ హీరో వెంకటేష్ మణికొండలోని పోలింగ్ బూత్ వద్ద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
5/6
సినీ నటుడు శ్రీకాంత్ తమ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 164) లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
6/6
సినీ నటుడు నితిన్ జూబ్లీ క్లబ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Updated at - 2023-11-30T09:40:57+05:30