Telugu Student: తీవ్ర విషాదం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి అనంతలోకాలకు..!

ABN , First Publish Date - 2023-03-11T08:57:10+05:30 IST

ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన బొడగల వంశీరెడ్డయ్య(23) కార్డియాక్‌ అరెస్టుతో హఠాన్మరణం చెందారు.

Telugu Student: తీవ్ర విషాదం.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థి అనంతలోకాలకు..!

కార్డియాక్‌ అరెస్ట్‌తో హఠాన్మరణం

‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ ఇంట విషాదం

మన్సూరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లిన బొడగల వంశీరెడ్డయ్య(23) కార్డియాక్‌ అరెస్టుతో హఠాన్మరణం చెందారు. వంశీరెడ్డయ్య తండ్రి బొడగల లవకుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’లో చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. వంశీరెడ్డయ్య మరణంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వంశీరెడ్డయ్య న్యూజెర్సీలోని సెయింట్‌ పీటర్స్‌ కాలేజీలో ఎంఎస్‌ చదివేందుకు ఆగస్టులో అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌ సమీపంలోని పొగెప్సిలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయిన వంశీరెడ్డయ్య.. మరునాడు ఉదయం నిద్ర లేవలేదు. దీంతో స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి వంశీరెడ్డయ్య కార్డియాక్‌ అరెస్టుతో చనిపోయాడని చెప్పారు. వంశీరెడ్డయ్య మృతదేహం బుధవారం నగరానికి చేరుకోవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

Updated Date - 2023-03-11T08:57:10+05:30 IST