Share News

NRI: లండన్‌‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-11-03T07:01:10+05:30 IST

ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా లండన్‌లో తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నికల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.

NRI: లండన్‌‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

NRI: ప్రపంచ దేశాల్లో మొట్ట మొదటిసారిగా లండన్‌లో తెలంగాణ ఎన్నారైలు, తెలంగాణ సంఘాలు ఐక్యంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నికల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కల్వకుంట్ల కవిత తన ప్రారంభోపన్యాసంలో తెలంగాణ ప్రవాసుల మధ్య సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ఐక్యతను పెంపొందించడం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. కమ్యూనిటీ సంస్థల సంస్కృతి, భాష, సేవా కార్యక్రమాలని ప్రశంసిస్తూ, లండన్ విభిన్న బహుళ సాంస్కృతిని ఆలింగనం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమమూలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

TT.jpg

తెలంగాణ తల్లి విగ్రహం ఇంగ్లండ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ సమాజానికి ఐక్యత, శక్తికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. ఇది మన భాగస్వామ్య వారసత్వం, సమాజంగా మనల్ని బంధించే విలువలను గుర్తుచేస్తూ, స్ఫూర్తిదాయకమైన దీపస్తంభంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రపంచ తెలంగాణ సమాజానికి గర్వకారణం మరియు వారసత్వ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించడం పట్ల తాము సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘాల నేతలు అన్నారు. ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత తన మాటలతో అందరిలో స్ఫూర్తి నింపినందుకు సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు కిశోరె మున్నాగాల, దన్నంనేని సంపత్ కృష్ణ, సుమన్ బలమూరి తదితరులు పాల్గొన్నారు.

T.jpg

Updated Date - 2023-11-03T07:01:12+05:30 IST