NRI: పోలాండ్‌లో భారత యువకుడి దారుణ హత్య..

ABN , First Publish Date - 2023-01-30T18:31:11+05:30 IST

పోలాండ్‌లో మరో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

NRI: పోలాండ్‌లో భారత యువకుడి దారుణ హత్య..

ఎన్నారై డెస్క్: పోలాండ్‌లో(Poland) మరో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళకు(kerala) చెందిన సూరజ్‌ను(23) కొందరు కత్తులతో పొడిచి చంపేశారు. ఆదివారం నాడు ఈ దారుణం జరిగింది. జార్జియా సంతతికి చెందిన కొందరితో వివాదం తలెత్తగా వారు సూరజ్‌పై దాడికి దిగి హత్య చేశారు. ఈ దాడిలో సూరజ్ వెంట ఉన్న నలుగురు కేరళ యువకులు కూడా గాయపడ్డారు. వార్సాలోని(Warsaw) భారతీయ ఎంబసీ. ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతకుకొద్ది రోజుల మునుపు కేరళకు చెందిన మరో యువకుడు హత్యకు గురయ్యాడు. పాలక్కాడ్‌కు చెందిన ఐటీ ఇంజినీర్ ఇబ్రహీమ్ షరీఫ్‌ను అతడి ఇంటి ఓనర్ కొడుకు హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. అయితే.. ఈ హత్య గల కారణమేంటో పోలీసులు ఇంకా చెప్పలేదని ఇబ్రహీం కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోగల శివ విష్ణూ దేవాలయ గోడలపై ‘ఖలిస్థాన్’ మద్దతుదారులు కొందరు విద్వేషపూరిత రాతలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక భారత సంతతి వ్యక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-01-30T18:31:15+05:30 IST