Republic Day : మోదీ తలపాగాలో అంతరార్థం ఇదే!

ABN , First Publish Date - 2023-01-26T12:23:44+05:30 IST

దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో

Republic Day : మోదీ తలపాగాలో అంతరార్థం ఇదే!
Narendra Modi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్ణరంజితమైన తలపాగాను ధరించారు. పొడవైన వస్త్రం వేలాడేవిధంగా అనేక రంగులతో కూడిన ఈ రాజస్థానీ తలపాగా అంతరార్థం ఏమిటని చాలా మంది ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. తెల్లని కుర్తా, ప్యాంట్స్, ఆ పైన నల్లని కోటు ధరించిన మోదీ రంగు రంగుల తలపాగాను ధరించడానికి కారణం మన దేశంలోని వైవిద్ధ్యాన్ని ప్రదర్శించేందుకేనని తెలుస్తోంది.

గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగే కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్‌లో సందేశాన్ని నమోదు చేశారు.

భారత దేశంలోని అమెరికన్ ఎంబసీ కూడా గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘వందే మాతరం’తో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు తెలిపింది.

Updated Date - 2023-01-26T12:24:48+05:30 IST