Vande Bharat Train: ఇకపై వందేభారత్‌కు 8 కోచ్‌లు

ABN , First Publish Date - 2023-06-02T09:01:18+05:30 IST

వందే భారత్‌ రైలుకు ఇకపై 8 బోగీలు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‏లో తొలిసారిగి స్వదేశీ సాంకేతిక

Vande Bharat Train: ఇకపై వందేభారత్‌కు 8 కోచ్‌లు

ఐసిఎఫ్(చెన్నై): ఛైర్‌కార్‌ వందే భారత్‌ రైలుకు ఇకపై 8 బోగీలు మాత్రమే ఉంటాయని అధికారులు తెలిపారు. పెరంబూర్‌ ఐసిఎఫ్‏లో తొలిసారిగి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన వందే భారత్‌ రైళ్లకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం 16,8 పెట్టెలతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రకం రైళ్లలో సీటింగ్‌ సౌకర్యం మాత్రమే ఉంది. ఈ విషయమై రైల్వే అధికారులు మాట్లాడుతూ, ఐసిఎఫ్‏లో ఇప్పటివరకు 20 వందే భారత్‌ రైళ్లు తయారయ్యాయని, వాటిలో ఎక్కువగా 16 పెట్టెలు కలిగి ఉన్నాయని తెలిపారు. 19వ వందే భారత్‌ రైలు(Vande Bharat Train) ముంబై-కోవై మధ్య ఈ నెల 3వ తేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో, అనవసర ఖర్చులు తగ్గించేలా సీటు సౌకర్యం ఉన్న వందే భారత్‌ రైళ్లను ఇకపై 8 పెట్టెలతో మాత్రమే తయారుచేయాలని రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసిందన్నారు.

Updated Date - 2023-06-02T09:01:20+05:30 IST