Union Minister: అన్ని రాష్ట్రాలు కోరితే ఆన్లైన్ రమ్మీ నిషేధం
ABN , First Publish Date - 2023-02-09T07:59:48+05:30 IST
రాష్ట్రాలన్నీ కోరితే దేశంలో ఆన్లైన్ రమ్మీ నిషేధం అమలు కోసం పరిశీలిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnav) సమాధానమిచ్చారు.
- పార్లమెంట్లో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 8: రాష్ట్రాలన్నీ కోరితే దేశంలో ఆన్లైన్ రమ్మీ నిషేధం అమలు కోసం పరిశీలిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Minister Ashwini Vaishnav) సమాధానమిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో బుధవారం డీఎంకే ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్ మాట్లాడుతూ, ఆన్లైన్ రమ్మీ నిషేధిస్తూ రాష్ట్రప్రభుత్వ చేసిన తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించకుండా ఉన్నారని, రమ్మీ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 40 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని, దానిని నిషేధించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు. ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ, దేశంలో 10 రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీ నిషేధిస్తూ తీర్మానాలు చేశాయని, అన్ని రాష్ట్రాలు ముందుకు వస్తే దేశంలో నిషేధం విధించే అంశం పరిశీలిస్తామని తెలిపిన కేంద్ర మంత్రి, తమిళనాడు గవర్నర్ ప్రభుత్వ తీర్మానాన్ని బుట్టదాఖలు చేశారని చెప్పలేమని స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: డెల్టా జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన