Indian students: ఉక్రెయిన్ రిటర్నీ వైద్య విద్యార్థులకు శుభవార్త

ABN , First Publish Date - 2023-04-13T07:42:03+05:30 IST

ఉక్రెయిన్-రష్యా యుద్దంతో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ దేశం బుధవారం శుభవార్త...

Indian students: ఉక్రెయిన్ రిటర్నీ వైద్య విద్యార్థులకు శుభవార్త
Indian students

న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్దంతో స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఉక్రెయిన్ దేశం బుధవారం శుభవార్త వెల్లడించింది.(Indian students ) ఉక్రెయిన్(Ukraine) దేశంలో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు భారతదేశం నుంచి కీలక పరీక్షకు అనుమతించనున్నారు.(appear for key exam from India) రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులు స్వదేశం నుంచి కీలక పరీక్షకు అనుమతిస్తామని ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ జపరోవా(Ukraine's First Deputy Foreign Minister Emine Dzhaparova) తెలిపారు.

గత ఏడాది ఫిబ్రవరి నెలలో రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్ దేశంలో వైద్యవిద్య చదువుతున్న 19వేలమంది భారతవిద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. న్యూఢిల్లీలో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా వైద్యవిద్యార్థులను పరీక్షకు అనుమతిస్తామని భారత్‌కు తెలిపారు.

ఇది కూడా చదవండి : North Korea : నార్త్ కొరియా మళ్లీ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

భారత వైద్య విద్యార్థులు తమ నివాస దేశంలో ఏకీకృత రాష్ట్ర అర్హత పరీక్షకు ఉక్రెయిన్ అనుమతిస్తుందని ఆ దేశ ఉప విదేశాంగశాఖ మంత్రి పేర్కొన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) బుధవారం తెలిపింది.ఉక్రేనియన్ అధికారుల చొరవతో భారతదేశంలో ఇప్పటికీ ఉన్న వైద్య విద్యార్థులు ఆన్‌లైన్ తరగతుల్లో చేరవచ్చు. భారతదేశంలో యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ (USQE)కి హాజరయ్యే అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-04-13T07:45:31+05:30 IST