Trains: ఆ మార్గంలో రైళ్ల వేగం పెంపు
ABN , First Publish Date - 2023-11-26T07:44:01+05:30 IST
ఎగ్మూరు - తిరుచ్చి(Egmuru - Trichy) మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. జోలార్పేట - సేలం,
![Trains: ఆ మార్గంలో రైళ్ల వేగం పెంపు](https://media.andhrajyothy.com/media/2023/20231102/nani2_43f2e067da.jpg)
ఐసిఎఫ్(చెన్నై): ఎగ్మూరు - తిరుచ్చి(Egmuru - Trichy) మార్గంలో రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు దక్షిణరైల్వే(Southern Railway) ప్రకటించింది. జోలార్పేట - సేలం, కోయంబత్తూరు మార్గంలో నడిచే రైళ్లవేగాన్ని 2024 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, ఎగ్మూరు - విల్లుపురం - తిరుచ్చి మార్గంలో నడిచే రైళ్ల వేగాన్ని 2026 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, తిరుచ్చి - దిండుగల్ - మదురై, తిరునల్వేలి - నాగర్కోయిల్ మార్గంలో నడిచే రైళ్ల వేగాన్ని 2027 మార్చిలోగా గంటలకు 130 కి.మీ, కరూర్ - దిండుగల్, మైలాడుదురై - తిరువారూర్, అరల్వాయ్మొళి - నాంగునేరి - మేలపాలయం, మదురె ౖ- తిరుమంగలం మార్గాల్లో నడిచే రైళ్ల వేగం 2024 మార్చిలోగా గంటలకు 110 కిలోమీటర్లకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.