Train extension: హుబ్లీ - తంజావూరు రైలు 2 నెలల పొడిగింపు

ABN , First Publish Date - 2023-07-20T11:55:38+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ(Hubli) నుంచి సేలం, కరూర్‌, తిరుచ్చి మీదుగా తంజావూరు(Thanjavur) వరకు నడిచే ప్రత్యేక రైలు(

Train extension: హుబ్లీ - తంజావూరు రైలు 2 నెలల పొడిగింపు

అడయార్‌(చెన్నై): కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ(Hubli) నుంచి సేలం, కరూర్‌, తిరుచ్చి మీదుగా తంజావూరు(Thanjavur) వరకు నడిచే ప్రత్యేక రైలు(నెం.07325, 26)ను మరో రెండు నెలల పాటు దక్షిణ రైల్వే పొడిగించింది. ప్రయాణికుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ రైలును వారంలో ఒక రోజు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబరు 25వ తేదీ వరకు ప్రతి సోమవారం నడిపేలా పొడిగించారు. హుబ్లీలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరే ఈ రైలు... తంజావూరుకు మరుసటిరోజు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం రాత్రి 7.40 గంటలకు తంజావూరులో బయలుదేరి హుబ్లీకి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందని దక్షిణ రైల్వే విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-07-20T11:55:38+05:30 IST