Sushma Swaraj:రాజకీయాల్లోకి సుష్మాస్వరాజ్ కుమార్తె...ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా బన్సూరి స్వరాజ్

ABN , First Publish Date - 2023-03-27T10:25:34+05:30 IST

కేంద్ర మాజీమంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె మన్సూరి స్వరాజ్ సోమవారం రాజకీయ రంగప్రవేశం చేశారు...

Sushma Swaraj:రాజకీయాల్లోకి సుష్మాస్వరాజ్ కుమార్తె...ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా బన్సూరి స్వరాజ్
Sushma Swaraj daughter Bansuri

న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె మన్సూరి స్వరాజ్ సోమవారం రాజకీయ రంగప్రవేశం చేశారు.(Sushma Swaraj) కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి అయిన సుష్మాస్వరాజ్ వారసురాలిగా(Sushma Swaraj daughter) మన్సూరి స్వరాజ్(Bansuri Swaraj) ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా నియమితులయ్యారు. విద్యాధికురాలైన బన్సూరి స్వరాజ్ వార్ విక్ యూనివర్శిటీలో్ ఇంగ్లీషు సాహిత్యంలో డిగ్రీ చదివారు. అనంతరం ఈమె లండన్ బీపీపీ లా స్కూలులో న్యాయవిద్యను అభ్యసించారు.

బారిస్టర్ లా పూర్తి చేసిన బన్సూరి ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేశారు. రియల్ ఎస్టేట్, టాక్స్, అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్లు, క్రిమినల్ కేసులను వాదిస్తున్న బన్సూరి హర్యానా రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా పనిచేస్తున్నారు. సుష్మా స్వరాజ్ వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన బన్సూరి స్వరాజ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-03-27T10:25:34+05:30 IST