Share News

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

ABN , First Publish Date - 2023-11-21T07:15:12+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం అర్దరాత్రి శంషాదాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం అర్దరాత్రి శంషాదాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో రసగుల్లాలు త్వరగా అయిపోయాయి. ఈ విషయమై ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమెదు చేశామని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ శర్మ తెలిపారు. "ఆదివారం బ్రిజ్‌భాన్ కుష్వాహా ప్రాంతంలో వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ఒక వ్యక్తి రసగుల్లాల కొరతపై ప్రశ్నించాడు. దీంతో గొడవ జరిగింది. ఈ గొడవలో భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్ అనే ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఎత్మాద్‌పూర్‌లో ఓ పెళ్లి వేడుకలో మిఠాయిల కొరత విషయమై జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Updated Date - 2023-11-21T07:15:20+05:30 IST