I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

ABN , First Publish Date - 2023-08-05T16:23:26+05:30 IST

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

I.N.D.I.A. Mumbai meet: కొత్త తేదీలు ఖరారు, శివసేన యూబీటీ అతిథ్యం

మంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.) మూడో సమావేశానికి ముంబై (Mumbai) ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తెలిపారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం సమావేశం ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 1వ తేదీన 10 గంటలకు తిరిగి సమావేశం కొనసాగుతుందని చెప్పారు.


మహా వికాస్ అఘాడి కూటమి సోమవారంనాడు సమావేశమైన అనంతరం మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ముంబైలో జరిగే సమావేశానికి ఉద్ధవ్ థాకరే ఆతిథ్యం ఇవ్వనున్నట్టు చెప్పారు. విపక్ష నేతలతో పాటు ఐదుగురు సీఎంలు ఆగస్టు 31వ తేదీన ఇచ్చే డిన్నర్‌లో పాల్గొంటారని, అనంతరం పాత్రికేయులతో సమావేశం ఉంటుందని అన్నారు. ముంబై సమావేశంపై చర్చించేందుకు ఎంవీఏ నేతలంతా సోమవారంనాడు సమావేశమయ్యారని, సమావేశాల విజయవంతానికి నేతలందరూ ఒక్కో బాధ్యత చొప్పన తీసుకోనున్నారని చెప్పారు.


కాగా, ఎంపీఏ సమవేశంలో ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, ఆ పార్టీ రాష్ట్ర విభాగం చీఫ్ జయంత్ పాటిల్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, సుభాష్ దేశాయ్, రౌత్, కాంగ్రెస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్ చవాన్, అశోక్ చవాన్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ బాలాసాహెబ్ థరోట్, అసెంబ్లీలో విపక్ష నేత విజయ్ వాడెట్టివార్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే హాజరయ్యారు. 26 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తొలి సమావేశం పాట్నాలో, రెండో సమావేశం బెంగళూరులో జరుగగా, మూడో సమావేశం ముంబైలో జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-08-05T16:26:33+05:30 IST