President: మద్రాసు వర్శిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

ABN , First Publish Date - 2023-07-25T08:21:11+05:30 IST

మద్రాసు విశ్వవిద్యాలయం(University of Madras) 165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupa

President: మద్రాసు వర్శిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

పెరంబూర్‌(చెన్నై): మద్రాసు విశ్వవిద్యాలయం(University of Madras) 165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) రానున్నారు. విశ్వవిద్యాలయ సెంటినరీ ఆడిటోరియంలో జరుగనున్న స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని, విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా ద్రౌపతిముర్ము రాష్ట్రానికి రానున్నారు. కాగా, స్థానిక గిండిలో రూ.250 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిన రాష్ట్రపతి.. విదేశీ పర్యటనతో రాలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా రాష్ట్రపతిని ఎవరు ఆపారో, ఎందుకు ఆపారో తమకు తెలుసంటూ డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-25T08:21:11+05:30 IST