President: 5న రాష్ట్రపతి రాక అనుమానమే?

ABN , First Publish Date - 2023-05-25T07:50:54+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగర పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. స్థానిక గిండిలో రూ.230 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ

President: 5న రాష్ట్రపతి రాక అనుమానమే?

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగర పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. స్థానిక గిండిలో రూ.230 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు జూన్‌ 5వ తేదీన రావాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రాష్ట్రపతిని ఆహ్వానించగా, అందుకు ఆమె సమ్మతించారు. ఈ మేరకు ఆమె పర్యటన కూడా ఖరారైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు రాష్ట్రపతి విదేశీ పర్యటన ఖరారైనట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ రోజున రాష్ట్రపతి చెన్నై పర్యటనకు రావడం అనుమానమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వాసుపత్రిని ముఖ్యమంత్రే ప్రారంభిస్తారా? లేక రాష్ట్రపతి పర్యటన మేరకు దానిని వాయిదా వేస్తారా? అన్నది తేలాల్సి వుంది.

Updated Date - 2023-05-25T07:50:54+05:30 IST