Under Construction Bridge Collapse: ఛత్తీస్‌గడ్‌లో భారీ వర్షాలకు కుప్పకూలిన బ్రిడ్జ్​

ABN , First Publish Date - 2023-06-29T22:47:53+05:30 IST

ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయిది. బ్రిడ్జ్​ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్​ ఫోన్లలో బంధించారు.

Under Construction Bridge Collapse: ఛత్తీస్‌గడ్‌లో భారీ వర్షాలకు కుప్పకూలిన బ్రిడ్జ్​

ఛత్తీస్​గఢ్​లోని(Chhattisgarh) దుర్గ్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న(Under Construction) ఓ వంతెన కుప్పకూలి(Bridge Collapses) వరదలో కొట్టుకుపోయిది. బ్రిడ్జ్​ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్​ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు.. వంతెన కాంట్రాక్టర్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

ధమ్​ధా మండలం సిల్లి, నన్​కట్టి గ్రామాలను కలిపేందుకు శివ్​నాథ్​​ నదిపై సాగ్ని ఘాట్ వద్ద వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్లపై స్టేజింగ్​, షట్టరింగ్​ పనులు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్​ నిండగా.. శివ్​నాథ్​​ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. బ్రిడ్జ్​ కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్​ కాగా..అధికారులు స్పందించారు.

‘‘వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, వంతెనల పనులు ఆపమని ఆదేశాలిచ్చాం. కానీ కాంట్రాక్టర్​ పనులు కొనసాగించాడు. నీటి మట్టం పెరిగి వంతెన కొట్టుకుపోయింది. దీనికి కాంట్రాక్టర్​​ నిర్లక్ష్యమే కారణం. షోకాజ్​ నోటీసులు జారీ చేస్తామని’’ స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​ తెలిపారు. కాగా.. రూ.16.40 కోట్ల అంచనా వ్యయంతో 2020లో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నవంబర్​ 2022 నాటికే పనులు పూర్తి కావాల్సిన ఉంది. కానీ తాజా ఘటనతో బ్రిడ్జ్​ పనులు మరింత జాప్యం కానున్నాయి.

Updated Date - 2023-06-29T22:47:53+05:30 IST