Share News

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:16 AM

ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi: వారణాసిలో మోదీ పర్యటన.. వందే భారత్ రైలు ప్రారంభించనున్న ప్రధాని

వారణాసి: ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఏడు అంతస్తుల స్వర్వేద మహామందిర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం వారణాసి - ఢిల్లీ(Varanasi - Delhi) మధ్య రెండో వందే భారత్ రైలు(Vandebarath)ను మధ్యాహ్నం 2.15 గంటలకు మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు.

ఈ రైలు వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్, కాన్ పుర్, ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి భౌపూర్ జంక్షన్ సెగ్మెంట్ ను ప్రారంభిస్తారు. రెండు రోజులపాటు ప్రధాని పర్యటన ఉండనుంది.

Updated Date - Dec 18 , 2023 | 10:18 AM