Karnataka: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-02-15T08:24:30+05:30 IST

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

Karnataka: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
BJP Karnataka president Nalin Kumar Kateel

బెంగళూరు: కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.(BJP Karnataka president Nalin Kumar Kateel) టిప్పుసుల్తాన్‌ను(Tipu Sultan) ప్రేమించే వారు కర్ణాటక రాష్ట్రంలో ఉండవద్దని నళిన్ కుమార్ కటీల్ కోరారు. కర్ణాటక రాష్ట్రం రాముడు, హనుమాన్ ఆరాధకులకు (Ram, Hanuman worshippers)మాత్రమేనని కటీల్ వ్యాఖ్యానించారు. ‘‘రాముడు, హనుమాన్‌లకు ఓటు వేయడం ద్వారా టిప్పు సుల్తాన్ వారసులను తరిమికొట్టండి’’అని బీజేపీ చీఫ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టిప్పుసుల్తాన్ వర్సెస్ సావర్కర్‌ల మధ్య పోరు అని నళిన్ కుమార్ పోల్చారు.అంతకుముందు రోడ్డు,మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్‌పై దృష్టి పెట్టాలని నళిన్ కటీల్ బీజేపీ కార్యకర్తలను కోరారు.తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని, రాముడు, హనుమంతుడి భక్తులమని, టిప్పుసుల్తాన్ వారసులను(Tipu Sultan descendants) ఇంటికి పంపిస్తామని బీజేపీ చీఫ్ చెప్పారు.

ఇది కూడా చదవండి :Valentines Day : ప్రేమికుల దినోత్సవం రోజు విషాదం...పాలోలెం బీచ్ కెళ్లిన దంపతులు ఏమయ్యారంటే...

‘‘నేను హనుమంతుని భూమిపై సవాలు చేస్తున్నాను, టిప్పుసుల్తాన్ ను ప్రేమించే వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు, రామభజన చేసేవారు, హనుమంతుడిని ప్రార్థించే వారు మాత్రమే ఇక్కడే ఉండాలి’’ అని నళిన్ కటీల్ స్పష్టం చేశారు. కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్‌ నారాయణ్‌(Karnataka’s Higher Education Minister Ashwath Narayan) టిప్పు సుల్తాన్ ను సిద్ధరామయ్యతో పోల్చారు. టిప్పు సిద్ధరామయ్య ఉరిగౌడ, నంజెగౌడ చేతిలో టిప్పుసుల్తాన్ లా ఓడిపోతాడని నారాయణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-15T08:24:32+05:30 IST