Share News

Assembly polls 2023: ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రసక్తే లేదు: సీఎం

ABN , First Publish Date - 2023-11-14T17:43:20+05:30 IST

రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని, నీళ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం వంటివి తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పారు.

Assembly polls 2023: ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రసక్తే లేదు: సీఎం

జైపూర్: రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తెలిపారు. ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించామని, నీళ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, రోడ్ల అనుసంధానం వంటివి తమ ప్రభుత్వం కల్పించిదని చెప్పారు. రాజస్థాన్‌లో శాంతి భద్రతల పరిస్థితిగా మెరుగ్గా ఉందని అన్నారు.


''కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ల పట్ల సానుభూతితో ఉందని, రాష్ట్రాన్ని నాశనం చేసిందని మోదీ చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే నక్సలైట్లకు మద్దతిచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఎందుకు డిస్మిస్ చేయలేదు? ఆ అధికారం వారికి ఉంది కదా? అంటే ఈ ఆరోపణల్లో నిజం లేనట్టే కదా. కేవలం ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చి మతం పేరుతో ప్రజలను వాళ్లు రెచ్చగొడుతుంటారు'' అని గెహ్లాట్ అన్నారు.


3 రాష్టాల్లో గెలుస్తాం: నితిన్ గడ్కరి

కాగా, మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరి బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు తప్పనిసరిగా గెలుచుకుంటామని చెప్పారు. మిజోరంలో తమ గెలుపు స్థానాలు పెరుగుతాయని, తెలంగాణలో విజయం సాధిస్తామని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ తప్పని సరిగా గెలుస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు. 20 ఏళ్లుగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం చేసిన మంచి పనులు, గత 10 ఏళ్లుగా ప్రధాని మోదీ సారథ్యంలో చేసిన అభివృద్ధి పనులు కారణంగా మధ్యప్రదేశ్‌లో కూడా తప్పనిసరిగా గెలుస్తామని గడ్కరి జోస్యం చెప్పారు.

Updated Date - 2023-11-14T17:43:21+05:30 IST