Mahua Moitra: బీజేపీ నేతలు రాక్షసులు...ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-27T08:01:07+05:30 IST

బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు...

Mahua Moitra: బీజేపీ నేతలు రాక్షసులు...ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
Mahua Moitra

కోల్‌కతా: బీజేపీ నేతలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.(Trinamool Congress MP Mahua Moitra) బిల్కిస్ బానో(Bilkis Bano case) రేపిస్టుతో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వేదిక పంచుకోవడంపై టీఎంసీ ఎంపీ మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహువా మోయిత్రా, దోషిగా తేలిన రేపిస్ట్ ఒక బీజేపీ ఎమ్మెల్యేతో వేదిక పంచుకున్న ఫోటోను షేర్ చేస్తూ ‘‘నేను ఈ రాక్షసులను తిరిగి జైలులో చూడాలనుకుంటున్నాను’’ అని ట్వీట్(Twitter) చేశారు.బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్, హత్య కేసులో 11 మంది దోషుల్లో ఒకరు గుజరాత్‌లో ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా సోమవారం ట్విట్టర్‌లో ఒక చిత్రాన్ని పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : North Korea: నార్త్ కొరియా మరో రెండు బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం

దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్‌ చిమన్‌లాల్‌ భట్‌ దాహోద్ బీజేపీ ఎంపీ జస్వంత్‌సిన్హ్ భభోర్,అతని సోదరుడు, లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌తో(Dahod BJP MP Jasvantsinh Bhabhor and his brother, Limkheda MLA Sailesh Bhabhor) కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు.దీనిపై ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దోషులను జైలులో పెట్టాలని ఎంపీ పిలుపునిచ్చారు, గత సంవత్సరం అత్యాచారం చేసిన దోషులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ముందస్తుగా విడుదలయ్యారు.

Updated Date - 2023-03-27T08:01:07+05:30 IST