Mlc: 30న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ABN , First Publish Date - 2023-06-07T11:49:16+05:30 IST

విధానపరిషత్‌లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ(Mlc) స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌(Central Elect

Mlc: 30న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): విధానపరిషత్‌లో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ(Mlc) స్థానాలకు ఈనెల 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌(Central Election Commission) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయిన ముగ్గురు సభ్యుల పదవీకాలం జూన్‌లో ముగియాల్సి ఉంది. అయితే వీరు ముందే తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. లక్ష్మణ సవది, బాబురావ్‌ చించన్‌సూర్‌, ఆర్‌ శంకర్‌(R Shankar) రాజీనామా చేసిన మేరకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీరిలో లక్ష్మణసవది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మిగిలిన ఇద్దరూ పదవికి దూరమయ్యారు. ఈనెల 13న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 20న నామినేషన్‌ల దాఖలు, 21న పరిశీలన, 23న ఉపసంహరణకు గడువు ఉంది. 30న పోలింగ్‌ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే పోలింగ్‌, అనంతరం కౌంటింగ్‌ జరగనుంది. జూలై 4 వరకు కోడ్‌ అమలులో ఉంటుంది.

Updated Date - 2023-06-07T11:49:16+05:30 IST