Share News

Mayawati: రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు

ABN , First Publish Date - 2023-12-10T14:17:57+05:30 IST

ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ఇవాళ ప్రకటించారు. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(BSP) బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు.

Mayawati: రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి.. చక్రం తిప్పనున్న మేనల్లుడు

లఖ్ నవూ: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ(BSP) అధినేత్రి మాయావతి(Mayawati) తన రాజకీయ వారసుడిని ఇవాళ ప్రకటించారు. మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(BSP) బీఎస్పీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆమె వెల్లడించారు. 2019లో మాయావతి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రముఖంగా వ్యవహరించారు.

ఆకాష్ ఆనంద్ అంతకుముందు పార్టీ జాతీయ సమన్వయకర్తగా ఉన్నారు. ఆదివారం(ఇవాళ) జరిగిన పార్టీ కీలక సమావేశంలో మాయావతి ఈ విషయాన్నివెల్లడించారు. బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్‌కి పార్టీలో మంచి పేరుంది. ఇకనుంచి బీఎస్పీ జాతీయ బాధ్యతలన్నీ ఆయనే చూడనున్నారు.

Updated Date - 2023-12-10T15:10:38+05:30 IST