Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..

ABN , First Publish Date - 2023-05-14T10:56:33+05:30 IST

ఓ మత పెద్ద గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది.

Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..
Akola Violence

ముంబై : ఓ మత పెద్ద గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. వీరు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకుని, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 నిబంధనలను విధించారు.

మహారాష్ట్రలోని అకోలా పోలీసు సూపరింటెండెంట్ సందీప్ ఘుగే మాట్లాడుతూ, గంగాధర్ చౌక్, పోలా చౌక్, హరిహర్ పేట్ ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని చెప్పారు. వీరు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారని చెప్పారు. వాహనాలకు నిప్పు పెట్టారని, ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులతో సహా ఎనిమిది మంది గాయపడ్డారని చెప్పారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 విధించినట్లు తెలిపారు. హింసను అదుపు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, దుండగులు పరిస్థితిని హింసాత్మకంగా మార్చారని తెలిపారు.

పోలీసు వ్యాన్‌ను ధ్వంసం చేశారని, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయని, దీంతో బాష్పవాయు గోళాలను ప్రయోగించామని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై రామ్ దాస్ పేట పోలీస్ స్టేషన్‌లోనూ, హింసాత్మక ఘర్షణలపై ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్‌లోనూ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.

అకోలా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి అదనపు బలగాలను రప్పించామని చెప్పారు. ఈ సంఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలపై 26 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Kothapaluku : నియంతృత్వ పోకడల నుంచి ఉపశమనం

Amit Shah, Sasikala: అమిత్ షాతో శశికళ భేటీ అయ్యారా.. అసలు వీరిమధ్య జరిగిన ఒప్పందం ఏంటో..

Updated Date - 2023-05-14T10:56:33+05:30 IST