కిరణ్ రిజిజు కారుకు ప్రమాదం, మంత్రి క్షేమం

ABN , First Publish Date - 2023-04-08T21:10:18+05:30 IST

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు శనివారంనాడు రోడ్డు మార్గంలో..

కిరణ్ రిజిజు కారుకు ప్రమాదం, మంత్రి క్షేమం

శ్రీనగర్ : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) జమ్మూ నుంచి శ్రీనగర్‌కు శనివారంనాడు రోడ్డు మార్గంలో వెళ్తుండగా రాంబాన్ జిల్లాలో ఆయన కారుకు స్పల్ప ప్రమాదం (Minor Accident) జరిగింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. అనంతరం కిరణ్ రిజిజు యధాప్రకారం కారులో తాను హాజరుకావలసిన కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రద్దీ కారణంగా రోడ్ జామ్ అయిందని, ఆ సమయంలో పూర్తి లోడ్‌తో ఉన్న ఒక వాహనం వెనక్కి జారి కిరణ్ రిజిజు కారును ఢీకొందని తెలుస్తోంది. అయితే, రిజిజు క్షేమంగా బయటపడ్డారు.

Updated Date - 2023-04-08T21:11:21+05:30 IST