Karnataka Elections: సోనియా విషకన్య ... బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-28T14:52:34+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల దాడి పెరుగుతోంది. వ్యక్తిగత విమర్శలు సైతం తారాస్థాయికి..

Karnataka Elections: సోనియా విషకన్య ... బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల దాడి పెరుగుతోంది. వ్యక్తిగత విమర్శలు సైతం తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ విషపూరిత పామని (Poisouns snake), కాటుకు గురైతే ఎంతటి వారైనా మరణించక తప్పదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) గురువారం చేసిన వివాదాస్పాద వ్యాఖ్యలపై బీజేపీ మండిపడిన కొద్దిసేపటికే, బీజేపీ నేతలు సైతం వివాదాస్పద వ్యాఖ్యలకు దిగారు. సోనియాగాంధీ (Sonia Gandhi) విషకన్య (Vishakanya) అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ యత్నాల్ (Basangouda Yatnal) శుక్రవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కస్సుమన్న కాంగ్రెస్

కాగా, సోనియాగాంధీని 'విషకన్య' అంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఏమి చెబుతారో ప్రజలు తెలుసుకోగోరుతున్నారని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపుట్టారు.

ఖర్గే వివరణ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విషపూరిత పాము అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడటంతో మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాను ప్రధానిపై వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆయన (మోదీ) ఆలోచనా విధనం ఆ విధంగా ఉంటుందన్నారు.

Updated Date - 2023-04-28T14:54:41+05:30 IST