Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్

ABN , First Publish Date - 2023-03-09T09:54:28+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు

Maoist Vs Police : సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా (Sukma) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు నక్సలైట్లు గాయపడినట్లు సమాచారం. గాయపడినవారు సంఘటన స్థలం నుంచి పారిపోతుండగా చూసినట్లు భద్రతా దళాలు తెలిపినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. కోబ్రా, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ సంయుక్త బృందానికి మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుంచి బీజీఎల్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నక్సలైట్ల కోసం గాలింపు కొనసాగుతోంది.

సుక్మా జిల్లా అత్యంత సమస్యాత్మక ప్రాంతం అనే సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత మిలిటరైజ్డ్ జిల్లాల్లో ఇదొకటి. నక్సలైట్-మావోయిస్ట్ తిరుగుబాట్ల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

Indira Eegalapati: హైదరాబాద్‌ మెట్రో టు సౌదీ మెట్రో.. రియాధ్‌లో మెట్రో రైలు నడుపుతున్న హైదరాబాదీ మహిళ..!

Why Dogs Chase Bikes: కుక్కలు మీ వాహనం వెంటపడి, భీకరంగా మొరుగుతూ వెంబడిస్తున్నాయా? దానికి కారణం ఇదే... వెంటనే ఏం చేయాలంటే?

Updated Date - 2023-03-09T09:54:28+05:30 IST