Governor: మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది

ABN , First Publish Date - 2023-09-21T07:28:00+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్‌ వల్ల మహిళా ప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై

Governor: మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది

- పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై

పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్‌ వల్ల మహిళా ప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై(Puducherry Governor Tamilisai) అన్నారు. పుదుచ్చేరి గోరిమేడు సమీపంలో ఉన్న ఆలంకుప్పం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మహోన్నత పాఠశాలల్లో అదనపు వసతులను ఆమె పరిశీలించారు. స్మార్ట్‌ తరగతికి వెళ్లి కాసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ... అసెంబ్లీ, పార్లమెంటుల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నిర్ణయించారని, ఇది మహిళలకు వరప్రసాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రిజర్వేషన్‌ అమలుకు వస్తే పుదువైలో 11 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా, తమిళనాడు 77 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎంపీలు కాగాలరన్నారు. గవర్నర్‌గా తాను ప్రజల మేలు కోసమే పనిచేస్తున్నానని, తన దృష్టికి వచ్చే ఫైళ్లను అధికారుల నుంచి సేకరించే సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నానని తెలిపారు.

Updated Date - 2023-09-21T07:28:00+05:30 IST