Former Chief Minister: మాజీ ముఖ్యమంత్రికి గౌరవ డాక్టరేట్‌

ABN , First Publish Date - 2023-07-21T13:01:37+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa)కు శివమొగ్గలోని శివప్పనాయక అగ్రికల్చరల్‌ యూ

Former Chief Minister: మాజీ ముఖ్యమంత్రికి గౌరవ డాక్టరేట్‌

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa)కు శివమొగ్గలోని శివప్పనాయక అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. శివప్పనాయక అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ 8వ స్నాతకోత్సవం శుక్రవారం జరుగనుంది. ఇదే సందర్భంగా మాజీ సీఎం యడియూరప్పకు గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేస్తామని యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌సీ జగదీష్‌ తెలిపారు. గవర్నర్‌ థావరచంద్‌ గెహ్లాట్‌ ఛాన్స్‌లర్‌ హోదాలో పాల్గొంటారని రాజ్యసభ సభ్యుడు, ధర్మస్థళ ధర్మాధికారి వీరేంద్రహెగ్డేలు ముఖ్యులుగా పాల్గొంటారన్నారు. కాగా కువెంపు యూనివర్శిటీ 33వ స్నాతకోత్సవ సందర్భంగా విద్యా, క్రీడారంగంలో రాణించిన సదానందశెట్టి, సాహిత్య, సంగీత రంగంలో పేరొందిన పండిత్‌ రాజ్‌గురుస్వామి కలికేరి, గ్రామీణాభివృద్ది రంగంలో ఎం.చంద్రప్పలకు గౌరవ డాక్టరేట్‌లకు ఎంపిక చేశారు.

Updated Date - 2023-07-21T13:01:39+05:30 IST