Share News

Express train: ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు

ABN , First Publish Date - 2023-11-23T11:11:59+05:30 IST

ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తిరువనంతపురం

Express train: ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు

పెరంబూర్‌(చెన్నై): ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల మధ్య పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. తిరువనంతపురం నుంచి చెన్నైకి వస్తున్న సూపర్‌ ఫాస్ట్‌ రైలు(Super fast train)లో బోగీలు అనుసంధానం చేసే ప్రాంతంలో హఠాత్తుగా పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్‌ రైలును నెమిలిచ్చేరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో, ప్రయాణికులు ఒక్కసారిగా రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి పరుగులు తీశారు. అధికారులు హుటాహుటిన బోగీల వద్దకు చేరుకుని పొగను నియంత్రించారు. బోగీల మధ్య ఉన్న బ్రేక్‌ రాపిడి కారణంగా పొగలు చెలరేగాయని అధికారులు తెలిపారు. 20 నిమిషాల అనంతరం రైలు చెన్నై బయల్దేరి వెళ్లింది.

Updated Date - 2023-11-23T11:12:01+05:30 IST