Ernakulam/Visakhapatnam: 7న ఎర్నాకుళం - వైజాగ్‌ స్పెషల్‌ ట్రైన్‌

ABN , First Publish Date - 2023-04-06T08:41:07+05:30 IST

ఈ నెల 7న ఎర్నాకుళం నుంచి విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైలును రైల్వే శాఖ నడుపునుంది. 18 స్లీపర్‌ కోచ్‌లు, రెండు వికలాం

Ernakulam/Visakhapatnam: 7న ఎర్నాకుళం - వైజాగ్‌ స్పెషల్‌ ట్రైన్‌

ఎర్నాకుళం/విశాఖపట్టణం: ఈ నెల 7న ఎర్నాకుళం నుంచి విశాఖపట్టణం మధ్య ప్రత్యేక రైలును రైల్వే శాఖ నడుపునుంది. 18 స్లీపర్‌ కోచ్‌లు, రెండు వికలాంగుల కోచ్‌లతో కలిసి మొత్తం 20 కోచ్‌లతో కూడిన ఈ రైలు (నెం.06005) ఎర్నాకుళం(Ernakulam)లో ఈ నెల 7వ తేదీ శుక్రవారం రాత్రి 23.50 గంటలకు బయలుదేరి విశాఖపట్టణానికి 8వ తేదీ శనివారం అర్ధరాత్రి 23.50 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు ఎర్నాకుళం నుంచి ఈరోడ్‌, సేలం, కాట్పాడి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ(Duvvada) మీదుగా విశాఖపట్టణంకు చేరుతుంది. ఈ నెల 6వ తేదీ ఉద యం 8 గంటల నుంచి ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే సౌలభ్యం కల్పించినట్టు దక్షిణ రైల్వే పేర్కొంది.

Updated Date - 2023-04-06T08:41:07+05:30 IST