Share News

Diwali Bonus: టాస్మాక్‌ సిబ్బందికి దీపావళి బోనస్.. 20 శాతం ప్రకటన

ABN , First Publish Date - 2023-11-10T08:47:02+05:30 IST

దీపావళి పండుగను పురస్కరించుకుని టాస్మాక్‌ సిబ్బందికి ప్రభుత్వం 20 శాతం బోన్‌స ప్రకటించింది. సంక్రాంతి, దీపావళి వంటి

Diwali Bonus: టాస్మాక్‌ సిబ్బందికి దీపావళి బోనస్.. 20 శాతం ప్రకటన

అడయార్‌(చెన్నై): దీపావళి పండుగను పురస్కరించుకుని టాస్మాక్‌ సిబ్బందికి ప్రభుత్వం 20 శాతం బోన్‌స ప్రకటించింది. సంక్రాంతి, దీపావళి వంటి పండుగల సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా, సహకార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. అదేవిధంగా, ఇపుడు టాస్మాక్‌ ఉద్యోగులకు కూడా 20 శాతం బోనస్‌ అందజేయనున్నట్టు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 5329 చిల్లర టాస్మాక్‌ దుకాణాలుండగా, వీటిలో దాదాపు 25 వేల మంది పనిచేస్తునన్నారు 2003-03 టాస్మాక్‌ దుకాణాల నుంచి ప్రభుత్వ ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.3639 కోట్లు. గత 20 యేళ్ళ కాలంలో ఈ ఆదాయం 14 వేల కోట్లకు చేరింది. అందువల్ల తమకు కూడా బోనస్‌ ఇవ్వాలని టాస్మాక్‌ సిబ్బంది డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇదే విషయంపై ఈ నెల 3వ తేదీ ప్రభుత్వ ఉన్నతాధికారులతో 21 టాస్మాక్‌ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సంప్రదించిన తర్వాత బోన్‌సపై ప్రకటన చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌(CM Stalin)తో మంత్రి ముత్తుస్వామి, హోం శాఖ కార్యదర్శి అముద, టాస్మాక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విశాకన్‌ చర్చలు జరిపారు. ఇందులో టాస్మాక్‌ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేసినట్టుగానే 20 శాతం బోనస్‌ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇదే విషయంపై ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం బోనస్‌ వల్ల ఆ దుకాణాల్లో పనిచేసే 25824 మంది సిబ్బంది లబ్ధి పొందనున్నారు.

సహకార శాఖ ఉద్యోగులకు 20 శాతం బోనస్‌!

- ఈపీఎస్‌ డిమాండ్‌

ప్యారీస్‌(చెన్నై): సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 20 శాతం దీపావళి బోనస్‌ ఇవ్వాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2016 నుంచి 2019వ సంవత్సరం వరకు రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం 20 శాతం దీపావళి బోనస్‌ అందజేసిందని గుర్తు చేశారు. అయితే డీఎంకే ప్రభుత్వం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే దీపావళి బోనస్‌ ప్రకటించి కో-ఆపరేటివ్‌ ఉద్యోగులను పక్కన బెట్టిందని ఈపీఎస్‌ ఆరోపించారు.

Updated Date - 2023-11-10T08:47:04+05:30 IST