Share News

Chief Minister: మోదీగారూ.. తక్షణం రూ.2వేల కోట్లు విడుదల చేయండి

ABN , Publish Date - Dec 21 , 2023 | 11:48 AM

కుండపోత వర్షాలకు నీట మునిగిన తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో బాధితులను ఆదుకునేందుకు

Chief Minister: మోదీగారూ.. తక్షణం రూ.2వేల కోట్లు విడుదల చేయండి

- ప్రధాని మోదీకి స్టాలిన్‌ వినతి

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కుండపోత వర్షాలకు నీట మునిగిన తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో బాధితులను ఆదుకునేందుకు తక్షణమే విపత్తుల నివారణ నిధి నుంచి రూ.2వేల కోట్లు విడుదల చేయాలని ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం రాత్రి 10 గంటలకు మోదీని ఆయన నివాసగృహంలో కలుసుకుని రాష్ట్రంలో చెన్నై సహా ఎనిమిది జిల్లాల్లో వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న సహాయకచర్యలను వివరించారు. మిచౌంగ్‌ తుఫాను కారణంగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు(Chennai, Tiruvallur, Kanchipuram, Chengalpattu) జిల్లాల్లో 47 యేళ్లలో లేనంతగా కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని అతలాకుతలం చేసిందన్నారు. ఆ జిల్లాల్లో యుద్థ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతుండగానే, దక్షిణాది జిల్లాలైన తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో యేడాదిపాటు కురవాల్సిన వర్షాలు ఒకే రోజు కురిసి బీభత్సాన్ని సృష్టించాయని ఆయన తెలిపారు. రెండు శతాబ్దాల్లో కురవనంతగా వాన కురిసిందని చెప్పారు. వీరిరువురూ సుమారు అరగంట సేపు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో నెలకొన్న వరద పరిస్థితులును వివరిస్తూ తక్షణమే రూ.2వేల కోట్లను కేటాయించాలని ప్రధాని మోదీకి ఆయన వినతిపత్రం సమర్పించారు.

nani4.2.jpg

Updated Date - Dec 21 , 2023 | 11:48 AM