Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు

ABN , First Publish Date - 2023-02-03T10:05:38+05:30 IST

అబుదాబి నుంచి కాలికట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి....

Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు
Air India Express flight

కాలికట్ (కేరళ): అబుదాబి నుంచి కాలికట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.(Air India Express flight) దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 348 లో మంటలు చెలరేగడంతో(Catches Fire) తిరిగి అబుదాబి(Abu Dhabi) విమానాశ్రయంలో దిగినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఇది కూడా చదవండి : Amul milk: నేటినుంచి అమూల్ పాల ధరలు పెంపు...లీటరుపై రూ.3 భారం

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్ 348లో మంటలను చూసిన పైలట్ అబుదాబికి తిరిగి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానం ఇంజనులో సాంకేతిక లోపం వల్లనే మంటలు(Technical Snag and Caught Flame) చెలరేగాయని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో విమాన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

Updated Date - 2023-02-03T10:05:39+05:30 IST