Sanjay Raut: ఏకే-47తో లేపేస్తా...ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బెదిరింపు

ABN , First Publish Date - 2023-04-01T11:42:25+05:30 IST

ఏకే-47తో లేపేస్తానని ఓ ఘరానా గ్యాంగ్‌స్టర్ సాక్షాత్తూ ఎంపీని బెదిరించిన ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది....

Sanjay Raut: ఏకే-47తో లేపేస్తా...ఎంపీ సంజయ్ రౌత్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బెదిరింపు
Sanjay Raut receives death threat

ముంబయి: ఏకే-47తో లేపేస్తానని ఓ ఘరానా గ్యాంగ్‌స్టర్ సాక్షాత్తూ ఎంపీని బెదిరించిన ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది.(AK-47 se uda dunga) మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు(Sanjay Raut) గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య చేస్తామని బెదిరింపు వచ్చింది.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi gang ) నుంచి తనకు ప్రాణహాని ఉందని(Receives Death Threat) శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మాదిరిగానే సంజయ్ రౌత్‌ను హిందూ వ్యతిరేకిగా పేర్కొంటూ హత్య చేస్తామని బెదిరింపు సందేశంలో గ్యాంగ్‌స్టర్ పేర్కొన్నాడు.గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను కూడా చంపుతామని బెదిరించింది.

ఇది కూడా చదవండి: IndiGo: ఇండిగో ఎయిర్ హోస్టెస్‌పై విమాన ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన...స్వీడిష్ జాతీయుడి అరెస్ట్

శుక్రవారం రాత్రి పూణె పోలీసులు బెదిరించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని ముంబయి పోలీసులకు అప్పగించారు.గత ఏడాది ఆగస్టులో పాత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరు గంటలకు పైగా ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది.ఏక్‌నాథ్ షిండే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ క్యాంపు నాయకులకు భద్రత తగ్గించారని సంజయ్ రౌత్ ఆరోపించారు. తాను బెదిరింపులకు భయపడనని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సంజయ్ చెప్పారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా భద్రతను తగ్గించిన తర్వాత గతేడాది మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపారు.

Updated Date - 2023-04-01T11:59:08+05:30 IST