Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2023-09-28T14:58:50+05:30 IST

పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

తమిళనాడు: పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత కేపీ మునుసామి(Munuswami) వెల్లడించారు. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai)ని తొలగించాలని తాము ఎన్నడూ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.


ఏఐఏడీఎంకే లాంటి పెద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందా.. అలా అడగడం తమ పార్టీకే చిన్నతనం, తాము అనాగరికులం కాదని, అలాంటి తప్పు చేయబోమని మునుసామి అన్నారు. ఎన్డీఏ(NDA) కూటమి నుంచి బయటకి వచ్చిన 3 రోజుల తరువాత అన్నాడీఎంకే మీడియాతో మాట్లాడింది. మళ్లీ ఎన్డీయేలో చేరతారన్న వదంతులపై మునుసామి స్పందిస్తూ.. సీఎం స్టాలిన్(CM Stalin) ఆయన కుమారుడు, మంత్రి ఉదయనిధి ఇదో డ్రామా అని చెబుతున్నారని.. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఎదురయ్యే భయంతోనే అలా మాట్లాడుతున్నారని అన్నారు. కె. పళనిసామి నేతృత్వంలో కొత్త కూటమిని పెడతామని మునుసామి తెలిపారు.

Updated Date - 2023-09-28T15:40:03+05:30 IST