Share News

Israel-Hamas: ఉత్తర గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఇరాక్‌లోని సైనిక స్థావరమే లక్ష్యంగా డ్రోన్ దాడి

ABN , First Publish Date - 2023-10-27T08:05:47+05:30 IST

ఇజ్రాయెల్ - హమాస్(Israel-Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా(Gaza)లోని అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్న ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లింది. తాజాగా ఆ దేశ సైన్యం ఉత్తర గాజాలోకి ప్రవేశించి దాడులు చేస్తోంది.

Israel-Hamas: ఉత్తర గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ఇరాక్‌లోని సైనిక స్థావరమే లక్ష్యంగా డ్రోన్ దాడి

జెరూసలెం: ఇజ్రాయెల్ - హమాస్(Israel-Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గాజా(Gaza)లోని అన్ని ప్రాంతాలను తమ పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్న ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రాంతంలోకి చొచ్చుకువెళ్లింది. తాజాగా ఆ దేశ సైన్యం ఉత్తర గాజాలోకి ప్రవేశించి దాడులు చేస్తోంది. అదే టైంలో సేనలు ఇరాక్(Irak)లోని యూఎస్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంపై డ్రోన్ దాడి(Drone Attack) చేసినట్లు సమాచారం. ఇరాన్(Iran) మద్దతు ఉన్న మిలీషియా ఉత్తర ఇరాక్ లోని యూఎస్(US) సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇప్పటివరకు గాజాలో మరణాల సంఖ్య 7 వేలు దాటింది. 2014లో ఆరువారాల పాటు జరిగిన గాజా యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.


వెస్ట్ బ్యాంక్ లో 100 మంది పాలస్తీనియన్లు హతమయ్యారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతున్నందున, ఇజ్రాయెల్ సైన్యం పూర్తి స్థాయి చొరబాటుకు సిద్ధం అవుతోందని.. ట్యాంకులు ఉత్తర గాజాలోకి ప్రవేశిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంతలో, ఇరాన్-మద్దతుగల మిలీషియా ఉత్తర ఇరాక్‌లో రెండు ఆత్మాహుతి డ్రోన్‌లతో యూఎస్ సైనికుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం 20 రోజులుగా జరుగుతోంది. హమాస్ మాట్లాడుతూ.. లెబనాన్ లో ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాతో సహా దాని మిత్ర దేశాల జోక్యం అవసరమని చెప్పింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి పంపిన సందేశంలో, మధ్యప్రాచ్యంలోని యూఎస్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) టెహ్రాన్‌ను హెచ్చరించినట్లు వైట్ హౌస్ అమెరికన్ దళాలపై వరుస దాడుల తర్వాత తెలిపింది. ఇజ్రాయెల్ ప్రభుత్వ సలహాదారులు గాజాలో యుద్ధం కారణంగా దెబ్బతిన్న నౌకలకు పరిహారం అందజేస్తామని తెలిపారు. నౌక ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.


రద్దైన విమానాలు

ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్ అల్ ఎయిర్‌లైన్స్ ELAL.TA గురువారం ముంబయి, ఢిల్లీకి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. హమాస్ ఉగ్రవాదులతో విమానాల రాకపోకలు తగ్గడంతో అనుకున్నదానికంటే ముందుగానే కొన్ని సీజనల్ మార్గాలను రద్దు చేస్తున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ ఫ్లాగ్ క్యారియర్ అక్టోబర్ 31 న డబ్లిన్, మార్సెయిల్, టోక్యోలకు సీజనల్ సర్వీస్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపింది.

Updated Date - 2023-10-27T08:06:28+05:30 IST