AP News: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ స్టడీ సర్కిల్లో..!
ABN , First Publish Date - 2023-07-26T13:03:14+05:30 IST
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ స్టడీ సర్కిల్-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్దమౌతున్న అభ్యర్థులకు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ స్టడీ సర్కిల్-యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్దమౌతున్న అభ్యర్థులకు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది. విశాఖపట్నం సెంటర్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్లకు; విజయవాడ సెంటర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్నకు; తిరుపతి సెంటర్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్నకు శిక్షణ ఇస్తారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; బీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు.
ఎంపిక: ప్రీ క్వాలిఫయింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఇస్తారు. కరెంట్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లయిమేట్ ఛేంజ్, ఇండియన్ పాలిటీ అండ్ డెవల్పమెంట్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవల్పమెంట్ ఇన్ ఇండియా, ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియాస్ నేషనల్ మూమెంట్ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ టెస్ట్లో సాధించిన మెరిట్ ఆధారంగా మొత్తం 150 మందికి అవకాశం కల్పిస్తారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో అర్హత పొందినవారిని మెయిన్స్ కోచింగ్కు ఎంపిక చేస్తారు. ఇందులో 50 నుంచి 100 మందికి అవకాశం ఇస్తారు. మెయిన్స్లో అర్హత సాధించినవారికి పర్సనాలిటీ టెస్ట్పై అవగాహన కల్పిస్తారు. అనుభవజ్ఞులైన ఐఏఎస్/ఐపీఎ్స/ఐఎ్ఫఎస్/ ఐఆర్ఎస్ ఆఫీసర్ల సహకారంతో పర్సనాలిటీ టెస్ట్లు నిర్వహిస్తారు. వీటికి హాజరయ్యే అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో వసతి ఏర్పాటు చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు లేదు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
వెబ్సైట్: apstdc.apcfss.in