UPSC: సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు
ABN , First Publish Date - 2023-05-23T15:35:54+05:30 IST
సివిల్ సర్వీసెస్-2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ

ఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2022 (Civil Services 2022) తుది ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38, ఐపీఎస్కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో చూడవచ్చు.
గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. 2022 సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించారు. ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో అదరగొట్టగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.
మెరిసిన తెలుగు తేజాలు..
ఈసారి కూడా తెలుగు బిడ్డలు సివిల్స్లో తమ సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకు సాధించగా.. హెచ్ ఎస్ భావన 55వ ర్యాంకు సాధించింది.
శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40
ఆవుల సాయికృష్ణ 94
నిధి (హైదరాబాద్) 110
అనుగు శివమారుతీరెడ్డి 132
రాళ్లపల్లి వసంత్ కుమార్ 157
కమతం మహేశ్కుమార్ 200
రావుల జయసింహారెడ్డి 217
విశాఖకు చెందిన సాహిత్య 243
అంకుర్ కుమార్ 257
బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి 270
చల్లా కల్యాణి 285
పాలువాయి విష్ణువర్దన్రెడ్డి 292
గ్రంథె సాయికృష్ణ 293
వీరగంధం లక్ష్మి సుజిత 311
ఎన్.చేతనా రెడ్డి 346
శృతి యారగట్టి ఎస్ 362
యప్పలపల్లి సుష్మిత 384
రేవయ్య 410
సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి 426
బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకు(ఒంగోలు)