UPSC: సివిల్ సర్వీసెస్‌-2022 తుది ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు

ABN , First Publish Date - 2023-05-23T15:35:54+05:30 IST

సివిల్ సర్వీసెస్‌-2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ

UPSC: సివిల్ సర్వీసెస్‌-2022 తుది ఫలితాలు విడుదల.. మెరిసిన తెలుగు తేజాలు
Civil Services 2022 Final Results

ఢిల్లీ: సివిల్ సర్వీసెస్‌-2022 (Civil Services 2022) తుది ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 933 మందిని యూపీఎస్సీ (UPSC) ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. ఐఏఎస్‌ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌ బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు.

గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. 2022 సివిల్స్‌ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులనూ అమ్మాయిలే సాధించారు. ఇషితా కిశోర్‌ ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో అదరగొట్టగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్‌. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.

మెరిసిన తెలుగు తేజాలు..

ఈసారి కూడా తెలుగు బిడ్డలు సివిల్స్‌లో తమ సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్‌ పవన్‌ దత్తా 22 ర్యాంకు సాధించగా.. హెచ్‌ ఎస్‌ భావన 55వ ర్యాంకు సాధించింది.

శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40

ఆవుల సాయికృష్ణ 94

నిధి (హైదరాబాద్‌) 110

అనుగు శివమారుతీరెడ్డి 132

రాళ్లపల్లి వసంత్‌ కుమార్‌ 157

కమతం మహేశ్‌కుమార్‌ 200

రావుల జయసింహారెడ్డి 217

విశాఖకు చెందిన సాహిత్య 243

అంకుర్‌ కుమార్‌ 257

బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270

చల్లా కల్యాణి 285

పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292

గ్రంథె సాయికృష్ణ 293

వీరగంధం లక్ష్మి సుజిత 311

ఎన్‌.చేతనా రెడ్డి 346

శృతి యారగట్టి ఎస్‌ 362

యప్పలపల్లి సుష్మిత 384

రేవయ్య 410

సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426

బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకు(ఒంగోలు)

Updated Date - 2023-05-23T15:52:54+05:30 IST