నా భర్తను వదిలేస్తా.. నువ్వూ నీ భార్యను వదిలేయ్.. పెళ్లి చేసుకుందాం.. ప్రేయసి ప్రపోజల్ ఓ రాష్ట్రాన్నే వణికించింది..!

ABN , First Publish Date - 2023-02-07T15:08:23+05:30 IST

ఆ ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి.. సంతోషంగా కాపురాలు సాగిస్తున్నారు.. ఇద్దరూ తమ తమ పెళ్లిళ్ల తర్వాత ప్రేమలో పడ్డారు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అయితే ఆ మహిళ అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. అతడు మాత్రం ఆమెతో శారీరక సంబంధం మాత్రమే చాలనుకున్నాడు..

నా భర్తను వదిలేస్తా.. నువ్వూ నీ భార్యను వదిలేయ్.. పెళ్లి చేసుకుందాం.. ప్రేయసి ప్రపోజల్ ఓ రాష్ట్రాన్నే వణికించింది..!

ఆ ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి.. సంతోషంగా కాపురాలు సాగిస్తున్నారు.. ఇద్దరూ తమ తమ పెళ్లిళ్ల తర్వాత ప్రేమలో పడ్డారు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అయితే ఆ మహిళ అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది.. అతడు మాత్రం ఆమెతో శారీరక సంబంధం మాత్రమే చాలనుకున్నాడు.. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు.. భర్తను వదిలి అతడితో వచ్చేందుకు సిద్ధపడింది.. దీంతో అతడు ఆమెను హత్య చేశాడు.. రాజస్థాన్‌లోని (Rajasthan) నాగౌర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది (Crime News).

నాగౌర్ జిల్లాలోని శ్రీబాలాజీ కాలనీకి చెందిన అనోపరామ్ అనే వ్యక్తి వివాహితుడు. అతడికి తమ పక్కింట్లో నివసించే వ్యక్తి భార్యతో స్నేహం కుదిరింది. ఇద్దరూ వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకున్నారు. తరచుగా కలుసుకునే వారు. ఈ క్రమంలో అనోపరామ్‌ను ఆ మహిళ మనస్ఫూర్తిగా ప్రేమించింది. అతడితో కలిసి జీవించాలనుకుంది. అనోపరామ్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. తన భార్యను వదిలి వెళ్లడం అతడికి ఇష్టం లేదు. మరోపక్క ప్రియురాలి ఒత్తడి తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ప్రియురాలని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎలా చంపాలి అనే దానిపై యూట్యూబ్‌లో కొన్ని వీడియోలు కూడా చూశాడు. ప్లాన్ సిద్ధం చేసుకుని ప్రియురాలిని రమ్మన్నాడు.

రోడ్డు పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడుతున్న యువతి.. సడన్‌గా ఆమె పక్కనే ఆగిన కారు.. పట్టపగలే జరిగిందేంటంటే..!

జనవరి 22న ఆ మహిళ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే రెండ్రోజులైనా ఆమె అటు పుట్టింటికీ వెళ్లలేదు.. అత్తారింటికీ రాలేదు. దీంతో ఆమె భర్త, ఆమె తల్లిదండ్రులూ జనవరి 24న పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. స్థానికులను విచారించగా ఆ మహిళకు అనోపరామ్‌తో వివాహేతర సంబంధం ఉందన్న విషయం తెలిసింది. వెంటనే అనోపరామ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు.

రెండ్రోజుల్లో పెళ్లి.. నలుగు పెట్టాక బాత్రూంకు వెళ్లిన వధువు.. ఎన్ని సార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..

జనవరి 22న బల్వా రోడ్డులోని అడవిలో తన ప్రియురాలిని హత్య చేసినట్లు అనోపరామ్‌ చెప్పాడు. ప్రియురాలిని హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి (Man chops off lovers body into pieces) అడవిలోని ఓ బావిలో పడేసినట్టు చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ బావి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ మహిళ బట్టలు, వెంట్రుకలు పోలీసులకు దొరికాయి. శరీర భాగాల కోసం ఆ బావిలోకి దిగి గాలిస్తున్నారు. మూడు రోజులుగా ఆ బావిలో గాలింపులు చేపడుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Updated Date - 2023-02-07T15:08:25+05:30 IST