Viveka Case: హైకోర్టులో వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్
ABN , First Publish Date - 2023-03-16T21:41:51+05:30 IST
తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వివేకా కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని కృష్ణారెడ్డి సవాల్ చేశారు. సీబీఐ కుట్రపూరితంగా దర్యాప్తు చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. కృష్ణారెడ్డికి పిటిషన్ వేసే అర్హత లేదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్పై వాదనలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
మరోవైపు వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా చూడాలని ఎంపీ అవినాశ్రెడ్డి (MP Avinash Reddy) హైకోర్టు కెళ్లారు. అవినాశ్రెడ్డి పిటిషన్పై ఇరువాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలన్న అవినాశ్రెడ్డి అభ్యర్థనపై రేపు (శుక్రవారం) న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. దీంతో రేపు హైకోర్టు తీర్పుపై అవినాశ్రెడ్డితో పాటు వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.