Bonda Uma: న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు
ABN , First Publish Date - 2023-11-21T20:11:39+05:30 IST
ఏఏజీ పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

ఢిల్లీ: ఏఏజీ పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.
"వైసీపీ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు." బోండా ఉమ మండిపడ్డారు.
"పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తి పై అభియోగాలు అంటకట్టారు. పోన్నవోలు సుధాకర్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తున్నారు. న్యాయవాదులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా సుధాకర్ రెడ్డి మాటలు ఉన్నాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు." అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు.