Nimmala Ramanaidu: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 సీట్లు కూడా రావు
ABN , First Publish Date - 2023-10-25T15:28:55+05:30 IST
వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి (YCP) రాష్ట్రంలో కనీసం పాతిక సీట్లు కూడా రావని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే
ఏలూరు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి (YCP) రాష్ట్రంలో కనీసం పాతిక సీట్లు కూడా రావని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)జోస్యం చెప్పారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే చంద్రబాబును (Chandrababu) కుట్ర పూరితంగా అరెస్టు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో రోజురోజుకీ ఆవేశం, ఆగ్రహాలు పెరుగుతున్నాయని తెలిపారు.
ముప్పిడి వెంకటేశ్వరరావు..
ఏలూరు: ద్వారకా తిరుమలలో ఎంపీ కోటగిరి శ్రీధర్ పుట్టినరోజు వేడుకలకు దేవస్థానం భోజనాలు పెట్టడాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సామాన్యులు కూడా డబ్బులు ఇస్తే భోజనాలు అదే విధంగా భోజనాలు పెడతారా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.