Share News

Nimmala: చంద్రబాబు ఆరోగ్యాన్ని జైల్లో క్షీణింపచేసేందుకు జగన్ కుట్ర

ABN , First Publish Date - 2023-10-13T15:01:05+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యాన్ని జైల్లో క్షీణింపచేసేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

Nimmala: చంద్రబాబు ఆరోగ్యాన్ని జైల్లో క్షీణింపచేసేందుకు జగన్ కుట్ర

పశ్చిమగోదావరి జిల్లా: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) ఆరోగ్యాన్ని జైల్లో క్షీణింపచేసేందుకు సీఎం జగన్ (CM Jagan) కుట్ర పన్నుతున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత డాక్టర్ నిమ్మల రామానాయుడు (Dr. Nimmala Ramanaidu) అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా పాలకొల్లు నియోజకవర్గం సర్పంచ్‌లు (Sarpanches), ఎంపీటీసీ (MPTC)ల 31వ రోజు నిరాహార దీక్షా కొనసాగుతోంది. శుక్రవారం రోడ్లు శుభ్రం చేస్తూ.. స్వచ్చంధంగా దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా, చర్మ సంబంధ రీత్యా తీసుకోవల్సిన జాగ్రత్తలు, సదుపాయాలు ఉద్దేశపూర్వకంగా జైలులో అందనివ్వడం లేదని ఆరోపించారు. అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలోని తేమ శాతం వంటి వాటితో డీహైడ్రేషన్‌కు గురై 5 కేజీల బరువు తగ్గడం ప్రమాదకరమని, మరో 2 కేజీలు తగ్గితే కిడ్నీలకు ప్రమాదకమని అన్నారు. చంద్రబాబుకు జైలులో నీటి ట్యాంకులు శుభ్రం చేయకుండా, శరీరానికి పడని బోర్ వాటర్ ఇస్తూ, నాసిరకం నీటి కూలర్ పెట్టి, దోమల నుండి రక్షణ లేకుండా చేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు ప్రాణానికి ప్రమాదం ఏర్పడితే జగన్ లక్ష రెట్లు మూల్యం చెల్లించుకోవల్సివస్తుందని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-10-13T15:01:05+05:30 IST