Raghu Rama Krishna Raju: అజయ్ కల్లం మంచివాడే.. కానీ...!

ABN , First Publish Date - 2023-07-29T17:40:34+05:30 IST

అజయ్ కల్లం మంచివాడు. కానీ ఆయన దుష్టుడి దగ్గర పని చేస్తున్నారని తెలుసు. గతంలో సీబీఐకి పచ్చి నిజాలు చెప్పారు. అజయ్ కల్లం ఉ.5 గంటలకు సమావేశానికి వెళ్లాను. ఉ.5.30కి ఫోన్ వచ్చిందని చెప్పారు. అది నిజమే కదా?, వేరే వాళ్ల పేర్లు లాగుతున్నారని అజయ్ కల్లం చెబుతున్నారు.

Raghu Rama Krishna Raju: అజయ్ కల్లం మంచివాడే.. కానీ...!

ఢిల్లీ: వైఎస్.వివేకా హత్య కేసులో అధికారులు తడబడుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అజయ్ కల్లం (Ajay kallam) మంచివాడు. కానీ ఆయన దుష్టుడి దగ్గర పని చేస్తున్నారని తెలుసు. గతంలో సీబీఐకి పచ్చి నిజాలు చెప్పారు. అజయ్ కల్లం ఉ.5 గంటలకు సమావేశానికి వెళ్లాను. ఉ.5.30కి ఫోన్ వచ్చిందని చెప్పారు. అది నిజమే కదా?, వేరే వాళ్ల పేర్లు లాగుతున్నారని అజయ్ కల్లం చెబుతున్నారు. వివేకా హత్య తర్వాత అవినాష్ రెడ్డి (Avinash Reddy) వేరే వాళ్లతో కూడా మాట్లాడారని సీబీఐ చెప్పింది. అమెరికా (America) నుంచి ఫోన్ కాల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. సోమవారం ఏం జరుగుతుందో తెలుస్తుంది. సీబీఐ ఏ సమాధానంతో చెబుతుందో చూడాలి. పురందేశ్వరి (Purandeswari), బీజేపీపై విజయసాయిరెడ్డి కామెంట్ చేస్తున్నారు. అది తప్పు. పురందేశ్వరి.. బీజేపీలో ఉంటూ వేరే పార్టీకి పని చేస్తారని ట్వీట్ చేస్తారా?, సాయిరెడ్డి ఈ మధ్య బాగానే ఉన్నారు అని అందరూ అన్నారు. ఈలోగా మళ్లీ మొదలుపెట్టారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్‌పై పోరాటం చేయరా? అని అడిగారు. పురందేశ్వరి ఫైట్ చేస్తే సాయిరెడ్డి, జగన్ ఏం చేస్తారు?, ఏపీలో బీజేపీని తిట్టి.. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మద్దతు అంటారా?, పాద సేవ చేసుకోండి కానీ చిల్లర కామెంట్లు మానేయండి.’’ అని రఘురామ హితవు పలికారు.

Updated Date - 2023-07-29T17:40:34+05:30 IST