Vangalapudi Anitha : నాపై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

ABN , First Publish Date - 2023-07-08T20:09:08+05:30 IST

టీడీపీ(TDP) చేస్తున్న విమర్మలకు సమాధానం చెప్పలేకే వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా(YCP Paytm Batch Social Media)లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత(Vangalapudi Anitha ) విమర్శించారు.

Vangalapudi Anitha : నాపై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం

అనకాపల్లి : టీడీపీ(TDP) చేస్తున్న విమర్మలకు సమాధానం చెప్పలేకే వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియా(YCP Paytm Batch Social Media)లో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత(Vangalapudi Anitha ) విమర్శించారు. శనివారం అనిత మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలం, మార్ఫింగ్‌లతో ఫొటోలు పోస్ట్‌లు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. వైఎస్ భారతిరెడ్డి పీఏ వర్ర రవీంధ్రరెడ్డి(Varra Ravindhra Reddy) సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారంతో పాటు, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ధ్వజమెత్తారు.. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణిపై దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మండిపడ్డారు.. ఈ విషయంపై నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశానని చెప్పారు. తెలుగుదేశంలో పార్టీ కోసం పనిచేసేందుకు నికార్సైన కార్యకర్తలు ఉన్నారన్నారు.


గతంలో వైఎస్ భారతిరెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే...చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సెమీనార్ నిర్వహించారని చెప్పారు. పవన్ సతీమణిపై అతిదారుణంగా పోస్ట్ పెడితే వాసిరెడ్డి పద్మ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. మహిళలపై దారుణంగా ట్రోల్ చేస్తున్న మహిళ హోం మినిస్టర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.జగన్, భారతి‌రెడ్డి, చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చిత్తశుద్ది ఉంటే సెమీనార్ నిర్వహించాలని చెప్పారు. ఈ రోజు నా సంతకం, రేపు మీ సంతకం కావోచ్చు... వదిలేస్తే.. జగన్ ప్రభుత్వంలోని ఏదో జీవో మీద సంతకం పెట్టేస్తాడని తక్షణమే అతడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్ర రవీంధ్రరెడ్డిని అరెస్ట్ చేయాలని లేకపోతే తీవ్ర నిరసనలు చేపడతామని వైసీపీ ప్రభుత్వా్న్ని వంగలపూడి అనిత హెచ్చరించారు.

Updated Date - 2023-07-08T20:20:46+05:30 IST