Visakha: పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

ABN , First Publish Date - 2023-08-11T16:54:02+05:30 IST

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విశాఖ పర్యటన సందర్భంగా టెన్షన్ కొనసాగుతోంది. పవన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆయన పర్యటనపై పోలీసులు విచిత్ర ఆంక్షలు విధించారు. జోడుగులపాలెం దగ్గర అందరూ ఆగిపోవాలని ఆదేశించారు.

Visakha: పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

విశాఖ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) విశాఖ పర్యటన సందర్భంగా టెన్షన్ (Tension) కొనసాగుతోంది. పవన్‌కు పోలీసులు నోటీసులు (Notices) జారీ చేశారు. మరోవైపు ఆయన పర్యటనపై పోలీసులు విచిత్ర ఆంక్షలు విధించారు. జోడుగులపాలెం దగ్గర అందరూ ఆగిపోవాలని ఆదేశించారు. రాడిషన్ బ్లూ హోటల్ దగ్గర పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. రుషికొండ (Rushikonda) దగ్గర రోడ్డుకు కుడివైపున పవన్ వెళ్లకూడదన్నారు. ఎడమవైపునే వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు. కుడివైపున ఉన్న రుషికొండవైపు కాకుండా ఎడమవైపు వెళ్లమనడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇక రుషికొండ దగ్గర మీడియా సమావేశం పెట్టవద్దని ఆంక్షలు పెట్టారు. గీతం యూనివర్శిటీ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఏమైనా నిషేధిత ప్రాంతమా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్చ, ప్రాధమిక హక్కులపై ఆంక్షలు, రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని జనసేన న్యాయవాదులు చెబుతున్నారు. కాగా నోవోటెల్ దగ్గర పవన్‌ని చూడడానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-11T16:54:02+05:30 IST