Share News

AP News: విశాఖలో జనసేన నేతల అరెస్ట్.. ఖండించిన పవన్

ABN , First Publish Date - 2023-12-11T15:12:01+05:30 IST

Andhrapradesh: విశాఖలో ఆందోళన చేస్తున్న జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, కోన తాతారావు సహా పలువురు జనసేన నేతలు నోవోటల్ హోటల్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు.

AP News: విశాఖలో జనసేన నేతల అరెస్ట్.. ఖండించిన పవన్

విశాఖపట్నం: విశాఖలో ఆందోళన చేస్తున్న జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్ బాబు, కోన తాతారావు సహా పలువురు జనసేన నేతలు నోవోటల్ హోటల్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం తోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన నేతలు నినాదాలు చేశారు. హలో ఏపీ... బై బై వైసీపీ అంటూ నోవాటల్ వద్ద నినాదాలు హోరెత్తాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.

జనసేన నేతల అరెస్ట్‌పై అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడిన జనసేన నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు మిగిలిన నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. జనసేన నేతలను విడుదల చేయకపోతే తానే విశాఖ వచ్చి ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-11T15:12:02+05:30 IST