Vishnuvardhan Reddy: 2024లో వైసీసీ అజెండా ఏంటో చెప్పాలి!?

ABN , First Publish Date - 2023-01-11T12:35:03+05:30 IST

2024కి జగన్ మోహన్ రెడ్డి (Jagan) అజెండా ఏమిటో చెప్పాలని బీజేపీ (bjp) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో

Vishnuvardhan Reddy: 2024లో వైసీసీ అజెండా ఏంటో చెప్పాలి!?
అజెండా ఏంటో చెప్పాలి!?

విశాఖ: 2024కి జగన్ మోహన్ రెడ్డి (Jagan) అజెండా ఏమిటో చెప్పాలని బీజేపీ (bjp) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao)వ్యాఖ్యలు చూస్తే 2024 నాటికి రెండు రాష్ట్రాలు లేదా మూడు రాష్ట్రాలు చెయ్యాలనుకుంటున్నారా? శాసనసభలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపిస్తారా? ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మంత్రి కారకుడవుతున్నాడు. 2024లో జగన్, మంత్రి ధర్మాన అజెండాలు ఒకటేనా? మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవా లేక ప్రభుత్వానిదా చెప్పాలి. ధర్మానను మంత్రివర్గం నుంచి తొలగించాలి. వైసీపీ (YCP) ఉత్తరాంధ్రకు చేసిందేమిటో శ్వేత పత్రం విడుదల చేయగలరా? ఇక్కడ వలసలు, నిరుద్యోగులు పెరగడానికి మీరు కారణం కాదా? వైసీపీ మంత్రులు అందరూ తీసేసిన తహశీల్దార్‌లా తయారయ్యారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహులు.. ప్రజల మధ్య తగాదాలు పెట్టి చలి కాచుకోవాలనుకుంటుంది. తెలుగుదేశం, వైసీపీ ఈ ప్రాంతాన్ని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దాచుకోవడం దోచుకోవడం.. ఎన్నికల్లో పోటీ చేయడo.. తప్పితే మరేం లేదు. ఏపీలో ఏకీకృతమైన అవినీతి జరుగుతుంది. వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి. అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుంది.’’ అని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - 2023-01-11T12:35:05+05:30 IST